జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రోహిన్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాదు : వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని అంబర్పేట నియోజకవర్గ ఇంచార్జీ రోహిన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రోహిన్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాదు : వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని అంబర్పేట నియోజకవర్గ ఇంచార్జీ రోహిన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.


