కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. తెలంగాణ సీఎం మారుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. 

 

Read More   చండూర్ లో బంపర్ ఆఫర్ - వామ్మో మొదటి బహుమతి 10 కేజీ ల మేక.. 2వ బహుమతి ఏమిటో తెలుసా ..!  99 కొట్టు మేకను పట్టు    

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని సెటైర్లు వేశారని.. అయితే వాళ్ల డిగ్రీలు తెలంగాణలో పనికిరావని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతున్న కిషన్ రెడ్డి కామెంట్స్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే.. కిషన్ రెడ్దికి తెలియని మరో విషయం .. బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని.. ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పారు. 

 

Read More   చండూర్ లో బంపర్ ఆఫర్ - వామ్మో మొదటి బహుమతి 10 కేజీ ల మేక.. 2వ బహుమతి ఏమిటో తెలుసా ..!  99 కొట్టు మేకను పట్టు    

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెబుతున్న కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల్లో అర్థం లేదని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని జగ్గారెడ్డి కమలం పార్టీని ఆత్మ రక్షణలో పడేశారు. దీంతో.. నిజంగానే బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా? లేకపోతే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారా అన్ని చర్చ నడుస్తోంది.