నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!!
- నిత్యం ప్రజలతో మమేకం అవుతు, కాంగ్రెస్ క్యాడర్ లో నూతనోత్సాహం నింపిన నేత
- పార్టీ శ్రేణులతో, ప్రజలతో కళకళలాడుతున్న గాంధీ భవన్
- మంత్రులు,ఎమ్మెల్యే ల ముఖాముఖి కార్యక్రమాలతో సందడిగా మారిన పార్టీ కార్యాలయం
- బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక..
- నాయకులకు ప్రజలకు మద్య వారధిగా పీసీసీ కార్యాచరణ..
- పార్టీ పదవుల అంశంలో సమన్వయంతో అడుగులు, విభేదాలకు తావు లేకుండా పార్టీ కార్యక్రమాలకు కృషి..
- పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై విశ్వంభర ప్రత్యేక కథనం .
విశ్వంభర,హైదరాబాద్ : "కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే సెప్టెంబర్ 6, 2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే పార్టీలో అందరివాడుగా ముద్ర వేసుకున్నారు."
కార్యకర్తలకు అందుబాటులో అతి సామాన్య కార్యకర్తగా..
ఒక్క ఉపాయం జీవితాన్నే మార్చేస్తుందనే ది వ్యాపార ప్రకటన, కానీ ఒక్క అవకాశం చరిత్రగతినే మార్చేస్తుందనే ది రాజకీయం. వందేళ్ల సుధీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అరుదైన సంఘటనలు, చరిత్ర గతిని మార్చే సందర్బాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా కూడా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. అంకితభావంతో పార్టీ కోసం పని చేసిన సామాన్య కార్యకర్తలు పార్టీ పరంగా అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలను ఆవిష్కరించిన ఆనవాళ్లు కూడా కోకొల్లలు. అచ్చం అదే కోవలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన మార్క్ రాజకీయాలను దూకుడుగా కొనసాగిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా విశ్వంభర ప్రత్యేక కథనం.
అందరివాడు గా పీసీసీ చీఫ్ ..
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున అంటే 6-9-2024న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించింది. మృధు స్వభావి, అజాత శత్రువు, అందరిని కలుపుకుని ముందుకు వెళ్లే మంచి మనసున్న మహేష్ కుమార్ గౌడ్ అనతి కాలంలోనే అందరివాడుగా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన 10 రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.ఆ తర్వాత ప్రభుత్వానికి, ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వారధిగా పనిచేస్తూ వినూత్న అడుగులు వేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్.
గాంధీ భవన్లొ సందడి వెనక పీసీసీ చీఫ్ ప్రత్యేక కార్యాచరణ..
గత సెప్టెంబర్ 25-2024వ తారీఖున మంత్రులను గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలని చెప్తూ ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని రూపొందించారు మహేష్ కుమార్ గౌడ్. ఏడాది కాలంగా ఆ కార్యక్రమం అజరామరంగా కొనసాగుతోంది. దీంతో ప్రతిరోజూ మంత్రులు, అనుచరులు, వివిధ సమస్యలతో వచ్చే సామాన్య ప్రజలతో గాంధీ భవన్ నిత్యం సందడిగా కనిపిస్తుంటుంది. అదే సెప్టెంబర్ 25న బీసీ సంఘాల నాయకులతో పీసీసీ అధ్యక్ష హోదాలో తొలి సమావేశం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని మొదటి సమావేశం రోజునే బీజం పడిందని చెప్పొచ్చు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటమే ఎజెండా..
ఆ తర్వాత జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు అక్టోబర్ 3నుండి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసారు మహేష్ కుమార్ గౌడ్. 2024 నవంబర్ 5వ తారీఖున కుల గణన విధి విధానాల కోసం బోయనపల్లి గాంధేయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధీ సారధ్యంలో జరిగిన భేటీకి కీలక సలహాలందించారు మహేష్ కుమార్ గౌడ్. కుల గణనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ సర్వే. అదే నెల నవంబర్ 10వ తారీఖున రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మలేషియా పర్యటనకు శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. అదే సంవత్సరం డిసెంబర్ 18న మణిపూర్ మారణహోమాన్ని నిరసిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం అధానీకి వ్యతిరేకంగా ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుండి అనూహ్య స్పందన రావడం విశేషం. మణిపూర్ ఘటనలకు నిరసన కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యక్రమాలే కాకుండా మానవీయ కోణంలో కూడా నాయకులు స్పందిస్తా రనే సంకేతాలు క్యాడర్ కు పంపించారు మహేష్ కుమార్ గౌడ్.
కేంద్ర సర్కార్ విధానాలపై వ్యతిరేకత ముందంజ..
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గౌతం అధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ వాస్తవాలు ప్రజానీకానికి తెలియజేసేందుకు ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుని విజయవంతం చేసారు మహేష్ కుమార్ గౌడ్. అంతే కాకుండా అంబేడ్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ తోపాటు జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక..
ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన బీసీ పోరు గర్జన కార్యక్రమానికి నేతృత్వం వహించారు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రాజ్యాధికారం, బీసీ సాధికారత, బీసీ రిజర్వేషన్ల సాధన పట్ల బీసీ సామాజిక వర్గంలో కొత్త ఆలోచనలకు ఈ నిరసన కార్యక్రమం శ్రీకారం చుట్టింది. అదే ఏప్రిల్ 8న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ మరియు ఏఐసీసీ సమావేశానికి హాజరై కీలక ప్రసంగం చేసారు మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 13న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వక్ప్ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. ఇదిలా ఉండగా ఏప్రిల్ 16న నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబ సభ్యుల విచారణ నోటీసుల నేపధ్యంలో బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్.
దిగ్విజయంగా ప్రజాప్రతినిధులు కార్యక్రమం..
ఇక మే నెలలో ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినూత్న ర్యాలీ నిర్వహించారు. అదే మే నెల 29, 2025 నుండి జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని జూన్ 4, 2025వరకూ అప్రతిహతంగా కొనసాగించారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 10వ తారీఖునుండి అందుబాటులో ప్రజాప్రతినిధులు కార్యక్రమం పేరుతో ప్రతీ రోజు ఒక నాయకుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ లో అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. జూలై 2న పఠాన్ చెరు సిగాచీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల మహేష్ కుమార్ గౌడ్ చలించిపోయారు. హుటాహుటిన బాధితులను పరామర్శించారు. బాధిత కుటంబాలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్.
కార్యక్రమాల రూప శిల్పి.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పీసీసీ..
జూలై 31 జనహిత పాదయాత్ర మరియు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పనితీరును క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రెండు విడతలుగా జరిగింది. అదే ఆగస్టు నెల 14న బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర కు సంఘీభావంగా ఓట్ చోర్ - గద్దీ చోడ్ అనే నినాదంతో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మహేష్ కుమార్ గౌడ్. దీంతో ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసి పార్టీ బలోపేతానికి దోహదం చేయడమే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు మహేష్ కుమార్ గౌడ్. సంవత్సర కాలంలోనే తన మార్క్ రాజకీయ ముద్రను బలంగా చాటుకున్నారు మహేష్ కుమార్ గౌడ్.
కృష్ణహరి. సీనియర్ జర్నలిస్ట్



