అంగరంగ వైభవంగా సమ్మక్క జాతర

అంగరంగ వైభవంగా సమ్మక్క జాతర

విశ్వంభర, సంగారెడ్డి: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని  సమ్మక్క జాతర మహోత్సవం  సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జోగిని శ్యామల నేతృత్వంలో బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ,  సమ్మక్క  జాతర సందర్భంగా ప్రతిసారి బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.అమీన్పూర్ డివిజన్ ఆధ్వర్యంలో జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Tags: