బ్రెయిన్ స్ట్రోక్ తో యువకుడు మృతి
On
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం లక్ష్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని రేకుల తండాకు చెందిన ( పర్వతగిరి ) ధరావత్ లక్ష్మణ్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో తో మృతి చెందాడు. మృతుని భార్య కన్నీరు మునీ రు అవుతూ నా భర్త బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం వల్ల కుటుంబం దీన స్థితి లో పడిపోయిందని ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది . ధరావత్ లక్ష్మణ్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన విషయం తెలుసుకున్న లక్ష్మతండా గ్రామపంచాయతీ సర్పంచ్ గూగుల్లోతు ఈశ్వరి రవికుమార్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని ధైర్యాన్నిచ్చారు .మృతుడికి భార్య , ఇద్దరు ,పిల్లలు , ఉన్నారు .



