తై బజార్ వేలం
On
విశ్వంభర, బొంరాస్ పేట్ : మండల పరిధిలోని బొమ్రాస్పేట్ గ్రామపంచాయతీ ప్రతి ఆదివారం నిర్వహించే కూరగాయల సంతకు డిఎల్పిఓ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో సుప్రియ పాండు కుమార్ 54 వేలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ , వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



