ఘనంగా శ్రీ మార్కండేయ సహిత శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం.
ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు , ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత
On
విశ్వంభర, సికింద్రాబాద్ :- శ్రీ మార్కండేయ సహిత శివ పంచాయతన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు , ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత పాల్గొని మృత్యుంజయ హోమము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు సంతోష్, చిలువేరి రామకృష్ణ , కండ్లపల్లి సత్య భూషణం, ఆడెపు శ్రీరాములు, ఇప్పర్ పల్లి శ్రీనివాసులు, విలాసాగరం శ్రీనివాస్, గుజ్జ ప్రవీణ్, ఇప్పరపల్లి విజయలక్ష్మి, చిలువేరి మాధవి, బొడ్డు సరస్వతి, విలాసాగరం సూర్య కళ, ఎనగంటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



