ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం విచారకరం

ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం విచారకరం

విశ్వంభర, చౌటుప్పల్:   చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 17 వ వార్డు ఏకగ్రీవం విషయంలో హైడ్రామా నడిచిందని  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం  నామినేషన్  విత్డ్రాకు చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయంలో 17 వ వార్డు  బిఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమా మహేశ్వరి సాయిలు బీఫామ్ పక్కకు పెట్టి.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి  ఆర్వో ,కమిషనర్ల ముందే  కార్యాలయంలో  సుమారు 15 మంది  చొరబడ్డారన్నారు .  కాంగ్రెస్ కు  అనుకూలంగా ఏకగ్రీవం  అయ్యేలా వ్యవహరించారు అని అన్నారు . ఈ తతంగం  అంతా  సీసీ కెమెరాలో  రికార్డు అయిందన్నారు.   ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడం విచారకరం అని, దీనిపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews