ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
On
- నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయనున్న కాంగ్రెస్
- రేపటి నుండి ప్రారంభం కానున్న గ్రామ, బస్తీ సభలు
- కార్యక్రమంలో పాల్గొన్న పలు శాఖల ఉన్నతాధికారులు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ళు పై రేపటి నుంచి ప్రారంభమయ్యే గ్రామ సభలు, బస్తి సభలు సందర్భంగా పథకాల పై నేడు హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ నందు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఎంఈఓ, ఎంఈవో, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం అధికారుల నుంచి ఎమ్మెల్యే నాగరాజు అభ్యంతరలు స్వీకరించి, అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు.
Read More సికింద్రాబాద్ ముక్కలైతే సహించం



