ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తాం

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తాం

విశ్వంభర, సిద్దిపేట: ప్రజాధనంతో నిర్మించిన సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ, ఫొటోలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. ఓర్వలేక కొండం సంపత్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి అర్హత లేని సంపత్ రెడ్డి ప్రజాపాలన 99రోజుల ప్రణాళిక ఫ్లెక్సీని చింపేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనగా శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వ ఫ్లెక్సీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు 1340 సర్వేనంబర్‌లో కొండం సంపత్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో దాస అంజయ్య, మార్క సతీష్, భిక్షపతి, అర్షద్, హుస్సేన్, వాహాబ్, అజ్మత్, ఖాయజుద్దీన్, చోటాస్మత్ అక్బర్, విజయ డానియల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు