హనుమంతుని ఆశీస్సులు ఉండాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత
విశ్వంభర, సూర్యాపేట: హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ప్రజలు ప్రతి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. శ్రీరాముని, హనుమంతుని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో హనుమాన్ విజయోత్సవ దినోత్సవం వెలుగులు నింపాలని, శ్రీరాముని, హనుమంతున్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి రమేష్, అభయాంజనేయ స్వామి ఆలయం కమిటీ చైర్మన్ కొత్త ఆంజనేయులు, ఆలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీదరాచార్యులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కారింగుల ఉపేందర్,పర్వతం శ్రీధర్, బైరు విజయ కృష్ణ, సంకరమద్ది మధుసూదన్, పున్నం సందీప్, బిజెపి నాయకులు రంగరాజు రుక్మారావు, చల్లమల్ల నరసింహ, పాండురంగా చారి, ఎల్గూరి రామ్మూర్తి, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, యామా సంతోష్, శ్రీరంగం రాము, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



