కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోంది 

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోంది 

  • : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 

విశ్వంభర, బషీర్ బాగ్: కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందని, లోక్ సభ, రాజ్య సభలో  సీట్లలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబానికి రెండు, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మూడు సీట్లు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాదిగలు అంటే అంతా చిన్న చూపా? ఈ విషయంపై భట్టి విక్రమార్క , వివేక్ వెంకటస్వామి స్పందించాలన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాలపై  ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదన్నారు. మాదిగలను రాజకీయ శక్తిగా ఎదిగేందుకు "మాదిగ మహా శక్తి" సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు  ఆయన వెల్లడించారు. మాదిగ ఓట్లు మాదిగలకే వేసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలోని ఉన్నాను. కాంగ్రెస్ లోనే కొనసాగుతాను అని తెలిపారు. మాదిగలకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని నర్సింహులు పేర్కొన్నారు. ఈనెల 5న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిగ మహాశక్తి సంఘం జెండా ఆవిర్భావం చేయనున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్, చిలక భాస్కర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు