మద్యం బాటిళ్ల పట్టివేత
1 విశ్వంభర, జిహెచ్ఎంసి: ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి విమానాల్లో ఎన్డీపీఎల్ మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి గురువారం తెల్లవారు జామున పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మూడు కేసులో 61 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 30 బాటిల్ను స్వాధీనం చేసుకొని మొదటి కేసులో మేకల మల్లేశం అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. రెండో కేసులో నాలుగు బాటిళ్లు, మూడో కేసులో 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పగడాల రమాకాంత్ అనే వ్యక్తికి కూడ నోటీసులు ఇచ్చారు. మొత్తం బాటిళ్ల విలువ రూ. 1.20 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
విశ్వంభర, జిహెచ్ఎంసి: ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి విమానాల్లో ఎన్డీపీఎల్ మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి గురువారం తెల్లవారు జామున పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మూడు కేసులో 61 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 30 బాటిల్ను స్వాధీనం చేసుకొని మొదటి కేసులో మేకల మల్లేశం అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. రెండో కేసులో నాలుగు బాటిళ్లు, మూడో కేసులో 27 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పగడాల రమాకాంత్ అనే వ్యక్తికి కూడ నోటీసులు ఇచ్చారు. మొత్తం బాటిళ్ల విలువ రూ. 1.20 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.



