మధ్యాహ్న భోజన ప్రక్రియ పరిశీలన

మధ్యాహ్న భోజన ప్రక్రియ పరిశీలన

విశ్వంభర, సిద్దిపేట: అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలోని మధ్యాహ్న భోజన పక్రియను కలెక్టర్ హైమావతి గురువారం తనిఖీచేశారు. అన్నం, పప్పు, బెండకాయ, రసం, పెరుగును పరిశీలించారు. కూరల నాణ్యత మెరుగుపర్చాలని, కూరలు విద్యార్థులకు సరిపోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరిపడేంత, రుచికరంగా వండాలని సూచించారు. ఇష్టానుసారంగా వండితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూర సరిపడేంత వండలేదని హాస్టల్ వార్డెన్‌పై యాక్షన్ తీసుకోవాలని డీసీవోను ఫోన్‌లో ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు