అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విశ్వంభర్, వరంగల్ :-కరుణపురంలోని క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో ఫౌండర్ పాస్టర్ రెవరండ్ పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించినట్లు పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా గోపు జయప్రకాష్ మాట్లాడుతూ యేసు ప్రభువు సిలువ చేసిన రోజు అని,ఏసు సిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటున్నారని తెలిపారు.యేసుక్రీస్తు మానవాళి చేసిన పాపాలను పోగొట్టడం కోసం తనను తాను త్యాగం చేస్తూ సిలువపై మరణించిన రోజును ఈస్టర్ ముందు వచ్చే పవిత్రమైన శుక్రవారంను గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని తెలిపారు.గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసాలు వుంటూ,ప్రత్యేక ప్రార్థనలు, జగరణలు చేసి యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని తెలిపారు.యేసుక్రీస్తు కల్వరి (గొల్గోత్ర) కొండపై సిలువ వేయబడిన దినమని, బాధను,త్యాగాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



