తెలంగాణ ప్రాంత ఆత్మీయ పండుగ పీర్ల పండుగ - టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్
పీర్లపండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాలి.
On
విశ్వంభర, హైదరాబాద్ ; హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం రాష్ట్రస్థాయి సభ జరిగింది. టి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ , ప్రముఖ రచయిత కవులు మాస్టర్ జి , టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ , మొహరం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టన్న, శ్రీధర్ , సాజిదా సికందర్ పాల్గొని ప్రసంగించారు. టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ పీర్ల పండుగ తెలంగాణ ప్రాంత ఆత్మీయ పండుగగా ప్రజలు చెప్పకుంటున్నారని అన్నారు. డప్పు కళాకారులు సన్నాయి కళాకారులు సమావేశంలో తమ ప్రదర్శనలతో ఆలరించారు. వ్యాప్తంగా వందలాదిమంది పాల్గొన్న ఈ సభ మరో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిందని నిర్వాహకులు తెలిపారు.



