మండల కార్యదర్శిగా దేవపంగు బిక్షం ఎన్నిక
విశ్వంభర, మహబూబాబాద్ : కురవి మండలం బలపాలలో అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ కురవి మండలం ఆరవ మహాసభలు నిర్వహించారు . ఈ మహాసభకి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ హాజరయ్యారు . ఈ సభను ఉద్దేశించి దేవేందర్ మాట్లాడుతూ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని , రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయాలని కౌలు రైతుల సమస్యలపై ఉద్యమించాలని , రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని మండల కార్యవర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు . అనంతరం మండల అధ్యక్షుడిగా కోడి నరసయ్య , మండల ప్రధాన కార్యదర్శిగా దేవా పంగ బిక్షం లను ఎన్నుకున్నారు .
మండల కార్యదర్శిగా దేవపంగు బిక్షం ఎన్నిక
విశ్వంభర, మహబూబాబాద్ : కురవి మండలం బలపాలలో అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ కురవి మండలం ఆరవ మహాసభలు నిర్వహించారు . ఈ మహాసభకి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ హాజరయ్యారు . ఈ సభను ఉద్దేశించి దేవేందర్ మాట్లాడుతూ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని , రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయాలని కౌలు రైతుల సమస్యలపై ఉద్యమించాలని , రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని మండల కార్యవర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు . అనంతరం మండల అధ్యక్షుడిగా కోడి నరసయ్య , మండల ప్రధాన కార్యదర్శిగా దేవా పంగ బిక్షం లను ఎన్నుకున్నారు .


