‘ప్రీమియర్ ఎనర్జీస్’ మెగా సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
On
విశ్వంభర,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో ప్రతిష్టాత్మక సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ నూతనంగా ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల మెగా ప్లాంట్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సీఎం గురువారం ప్లాంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో కేవలం 12 నెలల వ్యవధిలోనే ఈ గ్రీన్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు సుమారు 2,500 నుండి 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్లో భాగంగా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిని కాలుష్య రహిత ‘కోర్ అర్బన్ జోన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు.

అనంతరం ప్లాంట్ను సందర్శించిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు.. ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన మొట్టమొదటి సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ తో పాటు కంపెనీ నూతన ఉత్పత్తులను పరిశీలించి, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
🕒 10 Jul 2026 ✍️ Desk
‘ప్రీమియర్ ఎనర్జీస్’ మెగా సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
విశ్వంభర,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో ప్రతిష్టాత్మక సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ నూతనంగా ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల మెగా ప్లాంట్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సీఎం గురువారం ప్లాంట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో కేవలం 12 నెలల వ్యవధిలోనే ఈ గ్రీన్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు సుమారు 2,500 నుండి 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్లో భాగంగా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిని కాలుష్య రహిత ‘కోర్ అర్బన్ జోన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు.

అనంతరం ప్లాంట్ను సందర్శించిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు.. ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన మొట్టమొదటి సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ తో పాటు కంపెనీ నూతన ఉత్పత్తులను పరిశీలించి, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
🔗 https://www.vishvambhara.com/telangana/telangana-as-green-energy-hub/article-18412


