నేటి విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
పివైఎల్ నేత ఇరుగు అనిల్
విశ్వంభర, నెల్లికుదురు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని పివైఎల్ నేత ఇరుగు విద్యార్థి సంఘాల నాయకులకు విద్యార్థులకు విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు.మండల కేంద్రం నెల్లికుదురులో పిడిఎస్యు,పివై ఎల్ కార్యకర్తల సమావేశం లో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలను మూసి నాలుగు వేల పాఠశాలలను నిర్వహిస్తామనడం ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తుందని దీనిలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల పైన తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి నిత్యా నందు, రామ్ చరణ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేటి విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
విశ్వంభర, నెల్లికుదురు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని పివైఎల్ నేత ఇరుగు విద్యార్థి సంఘాల నాయకులకు విద్యార్థులకు విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు.మండల కేంద్రం నెల్లికుదురులో పిడిఎస్యు,పివై ఎల్ కార్యకర్తల సమావేశం లో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలను మూసి నాలుగు వేల పాఠశాలలను నిర్వహిస్తామనడం ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తుందని దీనిలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల పైన తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి నిత్యా నందు, రామ్ చరణ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


