పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి
On
- సీపీ సాయిచైతన్య
విశ్వంభర, నిజామాబాద్ : పోలీస్శాఖలో పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి రాగా వారిని సీపీ కార్యాలయం లో అభినందించారు. ఈ సందర్భంగా నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ బ్యాడ్జ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల ప్రకారం వారికి పదోన్నతులు లభించాయన్నారు. ప్రమోషన్ తర్వాత మరింత నిక్కచ్చిగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. వర్ని పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ కె.ఆనంద్, 2వ టౌన్ పోలీస్ స్టేష,న్లో సతీష్, ధర్పల్లి పోలీస్స్టేషన్లో కె.నవీన్ కుమార్, వన్టౌన్లో శశిప్రసాద్లు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు.



