మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి
ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..?
- సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ రాజ్యసభకు ఎంపిక చేసారు.
- గాంధీ ఐడియాలజీ లో పని చేసే వ్యక్తి మీనాక్షి నటరాజన్ పై లేని కేసును చూపించి దొంగతనం చేసింది బీజేపీ పార్టీ
- బురద జల్లుతుంది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ ప్రభుత్వం పైనా ?
- 12 ఏండ్ల బీజేపీ పాలనలో కుట్రలు..కుతంత్రాలు తప్పితే..ప్రజల పాలన ఎక్కడ?
- రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు ఓటు చోరీ చేసే గెలుస్తున్నారు అని....
- వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాల గెలుపు మీతో సాధ్యమా!
- అధికారం తో ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను కబ్జా చేస్తోంది బీజేపీ .
- ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..?
- సిగ్గు పడాలా..? సిగ్గుపడ్పాల్సిన అంశమా అనేది బీజేపీ నేతలు ఆలోచించుకోండి
- కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తోడ్కల్ తీస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాయని మచ్చగా నిలుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాని స్థాయిలో కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఒక రాజ్యసభ సీటు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే మహిళా నేత మీనాక్షి నటరాజన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.
గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తలదించుకునేలా పాలన చేస్తున్నారు. ఓట్ల చోరీ చేస్తూ బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. తాజాగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికను అడ్డుకుని సీటు చోరీ చేశారు. సాదాసీదా మీనాక్షి నటరాజన్ను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. దేశంలో బీజేపీ మహాభారతాన్ని మళ్లీ మొదలుపెట్టింది. మహాభారతంలో రాహుల్ గాంధీ ధర్మరాజులాంటి వాడు. మోదీ కౌరవుల నాయకుడు దుర్యోధనుడి లాంటివాడు. దుర్యోధనుడి కుటుంబంలో అందరూ డేంజరే. రాహుల్ గాంధీ శత్రువులను కూడా ప్రేమిస్తారు. మోదీ మిత్రులను కూడా శత్రువుల్లా చూస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ను ఏం చేయాలనే ఆలోచన తప్ప మోదీకి వేరే పనే ఉండదు. పరిపాలన చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఒక్క రాజ్యసభ సీటు కోసం మోదీ ఇంత దిగజారాలా?. దేశంలో బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోంది.
మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ, రాహుల్ గాంధీ ప్రకటించారు. రెండు రాజ్యసభ సీట్లు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి నైతిక విలువలు లేవు. మీనాక్షి నటరాజన్ను అడ్డుకోవడానికి దేశ ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. నటరాజన్ నిజాయతీ గల మనిషి. ఆమెను రాజ్యసభకు ఎన్నిక కాకుండా కింది స్థాయి నుంచి మోదీ వరకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. మోదీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క రాజ్యసభ సీటు కోసం పీఎంవో కార్యాలయం ఎందుకు ఇంతలా పని చేయాలి?. ఆమెకు నోటీసులు మాత్రమే ఇచ్చారు, కేసు నమోదు కాలేదు. ఇంతలా పొలిటికల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో తెలంగాణ బీజేపీ నేతలు చెప్పాలి. 12 సంవత్సరాల్లో మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయారు?. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?' అని ప్రశ్నించారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి
ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..?
విశ్వంభర,హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాయని మచ్చగా నిలుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాని స్థాయిలో కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఒక రాజ్యసభ సీటు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే మహిళా నేత మీనాక్షి నటరాజన్ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.
గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తలదించుకునేలా పాలన చేస్తున్నారు. ఓట్ల చోరీ చేస్తూ బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. తాజాగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికను అడ్డుకుని సీటు చోరీ చేశారు. సాదాసీదా మీనాక్షి నటరాజన్ను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. దేశంలో బీజేపీ మహాభారతాన్ని మళ్లీ మొదలుపెట్టింది. మహాభారతంలో రాహుల్ గాంధీ ధర్మరాజులాంటి వాడు. మోదీ కౌరవుల నాయకుడు దుర్యోధనుడి లాంటివాడు. దుర్యోధనుడి కుటుంబంలో అందరూ డేంజరే. రాహుల్ గాంధీ శత్రువులను కూడా ప్రేమిస్తారు. మోదీ మిత్రులను కూడా శత్రువుల్లా చూస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ను ఏం చేయాలనే ఆలోచన తప్ప మోదీకి వేరే పనే ఉండదు. పరిపాలన చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఒక్క రాజ్యసభ సీటు కోసం మోదీ ఇంత దిగజారాలా?. దేశంలో బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోంది.
మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ, రాహుల్ గాంధీ ప్రకటించారు. రెండు రాజ్యసభ సీట్లు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి నైతిక విలువలు లేవు. మీనాక్షి నటరాజన్ను అడ్డుకోవడానికి దేశ ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. నటరాజన్ నిజాయతీ గల మనిషి. ఆమెను రాజ్యసభకు ఎన్నిక కాకుండా కింది స్థాయి నుంచి మోదీ వరకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. మోదీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క రాజ్యసభ సీటు కోసం పీఎంవో కార్యాలయం ఎందుకు ఇంతలా పని చేయాలి?. ఆమెకు నోటీసులు మాత్రమే ఇచ్చారు, కేసు నమోదు కాలేదు. ఇంతలా పొలిటికల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో తెలంగాణ బీజేపీ నేతలు చెప్పాలి. 12 సంవత్సరాల్లో మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయారు?. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?' అని ప్రశ్నించారు.


