కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటe
On
- రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో రాయిని గూడెం వార్డు కు చెందిన 25 సంఘాలు ఎల్గూరి వినోదను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించి బోకే అందజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఎల్గూరి ఇంద్రవీరయ్య, సునీత, జ్యోతి, రేణుక, వనజ, రజిత, రేణుక, మనీ, యశోద, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.



