దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : దళితుల హక్కుల పరిరక్షణతో పాటు అసమానతలు, అంటరానితనం, కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఆహార భద్రతను బలోపేతం చేయాలని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను కాపాడే విధానాలు అమలు చేయాలని కోరారు. కుల వివక్ష, అంటరానితనం, అట్టడుగు వర్గాలపై దాడులను అరికట్టేందుకు సమష్టి ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
దళితుల హక్కుల కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : దళితుల హక్కుల పరిరక్షణతో పాటు అసమానతలు, అంటరానితనం, కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలను బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఆహార భద్రతను బలోపేతం చేయాలని, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను కాపాడే విధానాలు అమలు చేయాలని కోరారు. కుల వివక్ష, అంటరానితనం, అట్టడుగు వర్గాలపై దాడులను అరికట్టేందుకు సమష్టి ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


