పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు: ఏవీ రంగనాథ్
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా ప్రాంతాల్లో పేదల ఇళ్లను హైడ్రా తొలగించదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయా ప్రాంతాలను సందర్శించిన ఆయన, హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని పేదల ఇళ్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని స్థానికులకు సూచించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న నివాసాలను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ఆందోళనలకు ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ హామీతో స్థానికులు ఊరట వ్యక్తం చేశారు.
పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు: ఏవీ రంగనాథ్
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా ప్రాంతాల్లో పేదల ఇళ్లను హైడ్రా తొలగించదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయా ప్రాంతాలను సందర్శించిన ఆయన, హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని పేదల ఇళ్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని స్థానికులకు సూచించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నుంచి ఉన్న నివాసాలను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ఆందోళనలకు ప్రేరేపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ హామీతో స్థానికులు ఊరట వ్యక్తం చేశారు.


