విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విశ్వంభర, హైదరాబాదు : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని అన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని పేర్కొంటూ, ప్రజాభవన్ ముట్టడి సందర్భంగా జరిగిన అరెస్టులను యూఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, శాంతికుమార్, వెంకటేష్, సందీప్, తిరుపతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర నాయకులు గణేష్, రవి, శేఖర్, సయ్యద్, నవీన్, మనోజ్, రుక్మిణి, తులసి, శ్రీలత, ప్రవీణ్, జోహార్‌సింగ్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jul 2026 ✍️ Desk

విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విశ్వంభర, హైదరాబాదు : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని అన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని పేర్కొంటూ, ప్రజాభవన్ ముట్టడి సందర్భంగా జరిగిన అరెస్టులను యూఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, శాంతికుమార్, వెంకటేష్, సందీప్, తిరుపతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర నాయకులు గణేష్, రవి, శేఖర్, సయ్యద్, నవీన్, మనోజ్, రుక్మిణి, తులసి, శ్రీలత, ప్రవీణ్, జోహార్‌సింగ్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/education-problems-should-be-solved-immediately/article-18488

Tags: