అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
- ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కే ఎల్ ఆర్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలో మైలార్ బై తండా గంగారంలో గ్రామాలలో నిరుపేదలైన అర్హులందరినీ గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్ల మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో గంగారం గ్రామపంచాయతీకి దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది, నూతనంగానిర్మించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హాజరై గృహప్రవేశ కార్యక్రమం చేయబడింది, ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో అని సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, గ్రామ సర్పంచ్ గ్రామస్తులు ఇందిరమ్మ అభ్యర్థులు కే ఎల్ ఆర్ కు,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, వార్డ్ మెంబర్స్ మునావత్ రవి, ఏం లావణ్య ఎం పద్మ, ఎం ధర్మ, ఎం గోపి, ఏం భాస్కర్, ఎం శ్రీనివాస్, గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు,



