ఏలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలి
On
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 16 :
యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ ఆత్మకూరు(ఎం)మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేయాలి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కండిషన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారి సత్యనారాయణ, మండల కార్యదర్శి బూడిద నరసింహ గౌడ్, ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మధు, మండల సోషల్ మీడియా కన్వీనర్ సాయి, బూత్ అధ్యక్షులు లోడి వెంకటయ్య, సీనియర్ నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు