కమ్యూనిస్టులే ప్రజలకు అండ
- : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
విశ్వంభర, ముషీరాబాదు: ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, డీఏలు చెల్లించి పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా తగిన వేతనాలు లభించడం లేదని విమర్శించారు. ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యూసుఫ్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే.రవిచంద్రన్, కే.ఏసురత్నం, వనంపల్లి జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్ రావు, ఎం.నరసింహ, ఓమయ్య, విలాస్, పల్లె దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



