సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ సందర్శన
On
విశ్వంభర, ములుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు ఆదివారం హెలికాప్టర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సందర్శించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. సుధీర్ రామ్నాథ్ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.



