పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు 

పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు 

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం  గ్రామం పర్వతగిరి  జెడ్పిహెచ్ఎస్  పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల  ఫేర్వెల్ డే  ఘనంగా జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందుల శ్రీరాములు అధ్యక్షతన వహిoచారు  .ఈ  కార్యక్రమానికి   ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను , ఉద్దేశించి  సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా కష్టపడి , ఇష్టపడి, చదివినప్పుడే  ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని  విద్యార్థులకు పిలుపునిచ్చారు . ఇప్పటికి  కూడా ఎవరైనా బార్డర్  లైన్ లో ఉన్న విద్యార్థులు ఉంటే వారి పై   ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరీక్షలకు సన్నద్ధులు చేయాలని ,  ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష టైం టేబుల్ పరీక్షకు మూడు, నాలుగు, రోజుల విరామం ఒక పరీక్ష అయిన తర్వాత విరామ రోజులలో కూడా పాఠశాలలో వచ్చి ఉపాధ్యాయుల సలహాలు ,సూచనలు, పాటించాలని అన్నారు . అనంతరం విద్యార్థులకు పరీక్ష సామాగ్రి దాత అయిన సోమ  పురుషోత్తం ,  దంపతులు మరియు పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ దాత అయిన  నారాయణ సింగ్ , పరీక్షల సామాగ్రి అయిన ప్యాడ్స్ పెన్నులు పెన్సిల్లు కంపాస్ బాక్స్ తదితర వస్తువులను విద్యార్థులు అందజేశారు .  ఈ కార్యక్రమంలో  వివో ఏ  సుధాకర్. పాఠశాల ఇంచార్జ్ వ్యవహరిస్తున్న ఎన్ రవి. రవికుమార్. ఉమారాణి. కృష్ణ ప్రభాకర్ రాములు ప్రేమ కుమార్. శ్రీనివాస్. శ్రీలత. ఉపాధ్యాయులు , విద్యార్థిని, విద్యార్థులు,  తదితరులు పాల్గొన్నారు .

Tags: