క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్ లో ఇంగ్లీష్ ఫెయిర్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య సమాజానికి తప్పకుండా చాలా అవసరమని అన్నారు . విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, రోజు రోజుకి అంతరించిపోతున్నటువంటి విలువలను కాపాడే బాధ్యత విద్యార్థులపై ఉందని విద్యార్థులనీ కోరారు . ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ భాషా, ప్రావిణ్యత చాలా అవసరమని గుర్తు చేశారు . కష్టంతో కాకుండా, విద్యార్థులు చాలా ఇష్టంతో చదివి ఉన్నత మైన లక్షయాలకి చేరుకోవాలని, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని, అనంతరం విద్యార్థులు తమ యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు, బాటలు వేయాలని, అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రీనా గోపికృష్ణ , రజిత మాధవ్ , కమ్మగాని కృష్ణమూర్తి , స్కూల్ ఉపాధ్యాయులు హరి ప్రసాద్ , రఘు , ఉపేందర్, స్వామి, కపిలయ్య వీరన్న, యాసిన్ ,అశోక్ , వసీమ , సరోజినీ, శిరీష, సరస్వతి , ఉమామ జ్యోత్స, వెన్నెల ,రేణుక, పూజిత, సుధారాణి, అర్పిత ,ప్రభావతి ,స్వర్ణ, కావ్య ,శ్వేత, విద్యార్థులు, పాల్గొన్నారు.



