సుప్రియ పిళ్ళై స్ కిచెన్ గ్రాండ్ ఓపెనింగ్.
పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్ మందుల సూర్య కిరణ్
విశ్వంభర, హైదరాబాద్ :- సినీ నటి, మిస్ ఇండియా సౌత్ విన్నర్, సోషల్ వర్కర్ అండ్ ఫౌండర్ సుప్రియ పిళ్ళై ఏర్పాటు చేసిన సుప్రియ పిళ్ళైస్ కిచెన్ గ్రాండ్ ప్రారంభోత్సవం చైతన్యపురి లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మందుల సూర్య కిరణ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కిచెన్ గ్రాండ్ నిర్వాహకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా భోజన సదుపాయాల ఏర్పాటు ప్రజలకు మరింత చెరువగా అయ్యిందని , అలాగే ఎల్బీనగర్ , దిల్సుఖ్ నగర్ , కొత్తపేట దగ్గరలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుప్రియ పిళ్ళైస్ కిచెన్ ద్వారా మంచి నాణ్యతతో కూడిన భోజనం , 4ఏఎం బిర్యానీ సదుపాయాలు కల్పించి తక్కువ ధరలతో అందించడం చాల సంతోషకరమని అన్నారు. వీరివెంట గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్, కో ఫౌండర్ రాజా పిళ్ళై, ఫిలిం యాక్టర్, కో ఫౌండర్ కానుకుంట్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.



