శ్రీపాదరావు కు ఘనంగా నివాళులు
On
విశ్వంభర, మహబూబాబాద్: దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె అనిల్ కుమార్, ఆర్డీఓ, డీవైఎస్ఓ ఓలేటి జ్యోతి, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



