వనస్థలిపురం 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం. - ముఖ్య అతిధిగా పాల్గొన్న సామాజికవేత్త , బి.యన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత
On
విశ్వంభర , ఎల్బీనగర్ :- బి.యన్.రెడ్డి డివిజన్ లోని సచివాలయం నగర్ కాలనీలోని 8వి రోడ్ లో ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వనస్థలిపురం 2026 బ్యాడ్మింటన్ టైటిల్ ఆటను సామాజికవేత్త , బి.యన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాడ్మింటన్ ఆటలో బి.యన్.రెడ్డి డివిజన్ చుట్టుపక్కల ఉండే కాలనీ ప్లేయర్స్ చాలామంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన స్పోర్ట్స్ పర్సన్ కు గద్దె విజయ్ నేత చేతులమీదుగా మెమొంటోస్ అందించనున్నారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ పర్సన్ రాజేష్, జస్వంత్ ,అనిల్ చౌదరి, హేమంత్ ,జిలాని ,ముజీబ్, సచిన్ ,సాగర్, అఖిల్, అవినాష్, పవన్, తిరుమల్ రెడ్డి ,పృథ్వి, రాజు, వంశీ, పవన్ మొదలగు స్పోర్ట్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.



