గ్రామీణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ ,డీజిల్.గ్యాస్ , ధరను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై ధరలు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై పెనుబారం పడుతుందని వీటివల్ల నిత్యవసర వస్తువుల ధరలు రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువులపై ధరలు పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా విధానాలు అమలుపరుస్తూ ప్రజలపై పెనుబారం మోపుతుందని,పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదు అని అన్నారు.
గ్రామీణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ ,డీజిల్.గ్యాస్ , ధరను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రోజురోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై ధరలు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై పెనుబారం పడుతుందని వీటివల్ల నిత్యవసర వస్తువుల ధరలు రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువులపై ధరలు పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా విధానాలు అమలుపరుస్తూ ప్రజలపై పెనుబారం మోపుతుందని,పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదు అని అన్నారు.


