చైతన్య గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

చైతన్య గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

హాజరైన ఎమ్మెల్యే మురళి నాయక్ 

 విశ్వంభర,  మహబూబాబాద్: పర్వతగిరి గ్రామం లో చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ కి మహబూబాబాద్ శాసన సభ్యులు  డాక్టర్ భూఖ్య మురళి నాయక్  ముఖ్య అతిథి గా హాజరై  పురాహితులతో కలిసి  భూమి పూజ చేసి  శంకుస్థాపన చేశారు .  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్వతగిరి గ్రామానికి చెందిన గండు వెంకన్న జ్ఞాపకార్థం నా  200 గజాలు స్థలం డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘం  ( చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ ) కి  స్థలo  విరాళంగా ఇస్తున్నామని   స్వర్గీయ గండు వెంకన్న కుమారుడు గండు సురేష్  తెలిపారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూఖ్య మురళి నాయక్  కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  ఈరోజు మనము మన సొంత గ్రామమైన పర్వతగిరి గ్రామంలో  డ్వాక్రా  గ్రూప్ మహిళా సంఘం చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ కి స్థలదాత అయిన మన గ్రామానికి చెందిన గండు వెంకన్న జ్ఞాపకార్థం  ఆయన కుమారుడు గండు సురేష్  200 వందల గజాల స్థలం  ఇచ్చారంటే చాలా గొప్ప విషయమని  గుర్తు చేశారు . ఈ సందర్భంగా  మహిళా సంఘం గ్రూపు సభ్యుల, తరఫున , మన గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు .  అనంతరం ఈ గ్రామం మన సొంత గ్రామమని మనము మన గ్రామాన్ని అన్ని విధాలుగా  అభివృద్ధి చేసుకుందామని, అంతేకాకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అన్ని విధాలుగా మొదటి ప్రాధాన్యత ఇస్తుందని , ప్రభుత్వం నుండి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విడుదల చేసిందని , అన్ని విధాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు  చెందుతున్నాయి అని  ఎమ్మెల్యే గుర్తు చేశారు .  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు , ఎంపీడీవో రఘుపతి రెడ్డి , గ్రామ రెవెన్యూ అధికారి ఉప్పలయ్య , వివో ఏలు ఎలిశాల సుధాకర్ , నారాయణ సింగ్ , డ్వాక్రా గ్రూప్ సంఘం మహిళ నాయకులు మందుల పద్మ,  నారాయణ సింగ్ ,  కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడిసంది అశోక్, చల్ల వెంకన్న,   సంబంధిత అధికారులు , గ్రామస్తులు డాక్టర్ గ్రూప్  మహిళలు తదితరులు పాల్గొన్నారు .

🕒 26 May 2026 ✍️ Desk

చైతన్య గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

 విశ్వంభర,  మహబూబాబాద్: పర్వతగిరి గ్రామం లో చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ కి మహబూబాబాద్ శాసన సభ్యులు  డాక్టర్ భూఖ్య మురళి నాయక్  ముఖ్య అతిథి గా హాజరై  పురాహితులతో కలిసి  భూమి పూజ చేసి  శంకుస్థాపన చేశారు .  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్వతగిరి గ్రామానికి చెందిన గండు వెంకన్న జ్ఞాపకార్థం నా  200 గజాలు స్థలం డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘం  ( చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ ) కి  స్థలo  విరాళంగా ఇస్తున్నామని   స్వర్గీయ గండు వెంకన్న కుమారుడు గండు సురేష్  తెలిపారు .  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూఖ్య మురళి నాయక్  కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  ఈరోజు మనము మన సొంత గ్రామమైన పర్వతగిరి గ్రామంలో  డ్వాక్రా  గ్రూప్ మహిళా సంఘం చైతన్య గ్రామ సంఘం బిల్డింగ్ కి స్థలదాత అయిన మన గ్రామానికి చెందిన గండు వెంకన్న జ్ఞాపకార్థం  ఆయన కుమారుడు గండు సురేష్  200 వందల గజాల స్థలం  ఇచ్చారంటే చాలా గొప్ప విషయమని  గుర్తు చేశారు . ఈ సందర్భంగా  మహిళా సంఘం గ్రూపు సభ్యుల, తరఫున , మన గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు .  అనంతరం ఈ గ్రామం మన సొంత గ్రామమని మనము మన గ్రామాన్ని అన్ని విధాలుగా  అభివృద్ధి చేసుకుందామని, అంతేకాకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అన్ని విధాలుగా మొదటి ప్రాధాన్యత ఇస్తుందని , ప్రభుత్వం నుండి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విడుదల చేసిందని , అన్ని విధాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు  చెందుతున్నాయి అని  ఎమ్మెల్యే గుర్తు చేశారు .  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు , ఎంపీడీవో రఘుపతి రెడ్డి , గ్రామ రెవెన్యూ అధికారి ఉప్పలయ్య , వివో ఏలు ఎలిశాల సుధాకర్ , నారాయణ సింగ్ , డ్వాక్రా గ్రూప్ సంఘం మహిళ నాయకులు మందుల పద్మ,  నారాయణ సింగ్ ,  కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడిసంది అశోక్, చల్ల వెంకన్న,   సంబంధిత అధికారులు , గ్రామస్తులు డాక్టర్ గ్రూప్  మహిళలు తదితరులు పాల్గొన్నారు .

🔗 https://www.vishvambhara.com/telangana/foundation-stone-laying-of-chaitanya-gram-sangam-building/article-15919

Tags: