సబ్ జైల్ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని సబ్ జైలు, బాలల సదనము(బాలుర)లను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెళ్లి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు .ముందుగా సబ్ జైలును సందర్శించిన కార్యదర్శి జ్యూడిషల్ నిర్భంధం లో ఉన్నటువంటి మహిళలతో ముఖాముఖి మాట్లాడారు . జైలులో వారికి అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు , మరియు ఇతర మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని మాట్లాడుతూ న్యాయవాది, లేని వారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని ఖైదీలకు హామీ ఇచ్చారు . అనంతరం ప్రభుత్వ బాలల సదనాన్ని సందర్శించి, పిల్లలతో కాసేపు గడిపారు . మరియు పిల్లలకు అందిస్తున్న విద్యాబోధన, పౌష్టికాహారం , మరియు భద్రతపై ఆరా తీశారు . వంటశాల మరియు నివాస గదులను పరిశీలించి, పరిశుభ్రత , విషయంలో రాజీ పడకూడదని పలు సూచనలు సూచించారు . పిల్లల మానసిక వికాసం కోసం క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ , నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు . పిల్లలకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారి ఉజ్వల భవిష్యత్తుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .



