ఎన్జీవోస్ నేతలకు సన్మానం
టీవిశ్వంభర, బషీర్ బాగ్ : టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర అధ్యక్షుడిగా మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్ హుస్సేని ముజీబ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని గజమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షుడు, పాఠశాల విద్యా శాఖ హైదరాబాద్ అధ్యక్షులు కే.ఆర్ రాజ్కుమార్, కార్యదర్శి ఎం. భాస్కర్, ఫోరం సంయుక్త కార్యదర్శి రమేష్ టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్, కోశాధికారి బాల్రాజ్, ఉపాధ్యక్షులు ఖలీద్ అహ్మద్, బోలిగిడ్డ శంకర్, ప్రచార కార్యదర్శి వైదిక శాస్త్ర, సంయుక్త కార్యదర్శి గీత, కార్యవర్గ సభ్యులు శ్రీధర్, ముకీద్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ యూనిట్ ప్రచార కార్యదర్శి ఫెర్రస్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు ప్రియదేవ్ ఠాకూర్, ఫోరం ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్రీనివాస్, శివ, శివకుమార్, రాజశేఖర్, ఆదినారాయణ, లక్ష్మీపతి, అనిల్, సమీవుల్లా, పరమేష్, దామోదర్ రాజు పాల్గొన్నారు



