తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!

 

రెండు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్టీలు పెరిగాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దంటూ తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read More  కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

 హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే పెరిగిన టోల్ ధరల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను తాము సవరించామని... దాని వల్ల టోల్ ఫ్లాజాలు ఉన్న రూట్లలో మా్తరమే టోల్ సెస్ ను అమలు చేస్తున్నామని తెలిపింది. 

అంతే తప్ప మామూలు రూట్లలో తిరిగే బస్సుల్లో ఎలాంటి ఛార్టీలు పెంచలేదని కుంద బద్దలు కొట్టేసింది. కొందరు కావాలనే ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వార్తలను అస్సలు నమ్మొద్దంటూ తెలిపారు అధికారులు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.