సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఈటలకు వినతి.
On
విశ్వంభర, చైతన్యపురి : కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. న్యూ దిల్ సుఖ్ నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు ఉన్నాయని, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా, కాలనీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు, పద్మిని, సుస్మిత, గోవింద్ రాజు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్ , సీనియర్ నాయకులు వినోద్ యాదవ్ పాల్గొన్నారు.



