జోరుగా బీఆర్ఎస్ ప్రచారం
On
విశ్వంభర, మహబూబాబాద్ : కాలనీలో ఉన్న సమస్యలన్నీ తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి వార్డుని సుందరవందంగా అభివృద్ధి చేసి చూపిస్తానని 24 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న వెన్నమల్ల అజయ్ చెప్పారు. తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 24వ వార్డు లోని పలు కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతకు ముందు కూడా నేను వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి ఈ వార్డు పరిధిలోని పలు కాలనీలలో చాలా అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు .



