శ్రీరాములవారు మనందరికీ ఆదర్శం
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ శ్రీ అయ్యప్ప దేవాలయంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, ఆ శ్రీరాముని దివ్య అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డి సీసీ తోటకూర వజ్రేష్ యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, ఆనంద్ గురు స్వామి, విక్రమ్ ముదిరాజ్, సుమన్ గౌడ్, రాజా నాయక్, పెద్దలు, మాజీ సర్పంచ్ బాలగౌని చిన్న నర్సింమా గౌడ్, నానవత్ బిక్కు నాయక్, మాజీ ఉపసర్పంచ్ బాలగౌని శంకర్ గౌడ్, పెద్ద శంకర్ గౌడ్, చిన్న శంకర్ గౌడ్, పొలాగోని వెంకట్ స్వామి, రాదారం శ్రీశైలం, రాధారం, పెంటయ్య, రాదారం, యాదగిరి, ఆలయ బ్రాహ్మణోత్తములు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



