ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు
ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
విశ్వంభర, చండూరు: పదవ తరగతి వరకు గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదివి, మంగళవారం నాడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు నడికూడ మేఘన శ్రీ తండ్రి నాగాచారి ఎంపీసీ విభాగంలో 467/470 మార్కులతో స్టేట్ మూడవ ర్యాంకును సాధించింది, భూతరాజు చంద్రస్మిత తండ్రి రమేష్ 466/ 470 మార్కులతో స్టేట్ నాలుగవ ర్యాంకును, పాలకూరి ద్రువిత తండ్రి కిరణ్ కుమార్ 465/470, జక్కల హేమలత 465/470, కారింగు నికిల్ తండ్రి ఆంజనేయులు 465/470, మురారి శెట్టి తేజస్విని తండ్రి శ్రీనివాసులు 465/470, కె. అనూష 464/470 మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆవుల దీక్షిత 980/1000 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకులు సాధించినందులకు గాను గాంధీజీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు శాలువాలు కప్పి, బహుమతులను అందించి, ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విద్యార్థులందరూ 10వ తరగతి వరకు గాంధీజీ విద్యాసంస్థలలో చదివి మంచి ఫలితాలు సాధించి, నేడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా స్టేట్ ర్యాంకులు సాధించడం సంతోషకరమని, విద్యార్థులు ఇదేవిధంగా క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని, చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.