జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
- పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
- రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి 65 కు సంబంధించి జరుగుతున్న రోడ్డు విస్తరణ , ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ సంయుక్తంగా పరిశీలించారు. జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో కలిసి వారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిశితంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా, అత్యంత వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తదుపరి జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు, రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి 65 కు సంబంధించి జరుగుతున్న రోడ్డు విస్తరణ , ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ సంయుక్తంగా పరిశీలించారు. జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో కలిసి వారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిశితంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా, అత్యంత వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తదుపరి జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు, రక్షణ కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జాతీయ రహదారుల అథారిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


