ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

విశ్వంభర,  నాగారం: రైస్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో   నాగారం మండల కేంద్రం, సూర్యాపేట  జిల్లా లో  మూడు నెలలుగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి శిక్షణ తీసుకున్న 30 మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్లు , శిక్షణ పత్రాలు అందజేసి.  ఎస్సై చిరంజీవి   మాట్లాడుతూ ప్రతి మహిళ తను నేర్చుకున్న శిక్షణతో, ఉపాధి పెంచుకుంటూ మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలని, ప్రతి మహిళ తన కాళ్లమీద తాను నిలబడాలని,  విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని శిక్షణ నేర్చుకోవాలని ,   మహిళలందరూ స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలబడాలని, కుట్టు శిక్షణ లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మరింత అభివృద్ధి  మా ఈ రైస్ సంస్థను 2009 లో  ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో ,పేద ప్రజలు నివసిస్తున్న అటువంటి పట్టణాలలో విద్య, జీవనోపాది, వ్యవసాయం మరియు వైద్యం , వికలాంగుల ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, 730 మందికి కుట్టు మిషన్లు అందజేశామని అని అన్నారు.  రైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఫౌండర్ మొగుళ్ళ అమరేందర్ గౌడ్ , కోశాధికారి నరేష్ కుమార్ రెడ్డి , ,సంస్థ కోఆర్డినేటర్   రమేష్   కుట్టుమిషన్  మిషన్ శిక్షకురాలు శ్రీమతి  శోభ  యలమకంటి సోమన్న  శ్వేత, పవన్, వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.

Tags: