కుట్రతో నాపై కేసు పెట్టారు: కార్పొరేటర్ మఠం పవన్
విశ్వంభర, నిజామాబాద్ : కుట్రతోనే నాపై తప్పుడు కేసు బనాయించారని 8వ డివిజన్ బీజేపీ కార్పొరేషన్ మఠం పవన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. ఆ ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ బిల్డర్ దగ్గర తాను డబ్బులు వసూలు చేయలేదన్నారు. కావాలనే కుట్రపన్ని తనపై కేసు బనాయించారని ఆయన పేర్కొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాల రమేశ్, మాజీ కార్పొరేటర్ సదానంద్, మరో వ్యక్తి కలిసి తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ విషయమై 5వ టౌన్ ఎస్సై తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజమన్నారు. న్యాల్కల్ రోడ్లోని మున్సిపల్ స్థలాన్ని బిల్డర్ అసోసియేషన్లోని కొందరు, కాంగ్రెస్ లీడర్లు కబ్జా చేశారని, ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయంపై కక్షకట్టిన సదరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని చెప్పారు



