ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎర్ర కృష్ణ మాట్లాడుతూ, మాదిగ కులస్తులందరూ ఉమ్మడిగా కలిసికట్టుగా ఉంటే మనం ఏమైనాసాధించగలుగుతామని అన్నారు. ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న సరే ఎమ్మార్పీఎస్ మన జాతిని తలెత్తుకునేలా చేసింది నేను మాదిగనే చెప్పే స్థాయికి తీసుకువచ్చిన నాయకులు మందకృష్ణ మాదిగ, అలాంటి గొప్ప నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టమని మన నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. జండా ఆవిష్కరణ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని ప్రతి సంవత్సరం విజయవంతంగా చేయాలని యువకులకు సూచించారు, ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ మందకృష్ణ సారథ్యంలో సాధ్యమైన తర్వాత ఆ పొలాలను మనము అనుభవించాలంటే విద్యకు దూరంగా వద్దు చదువులో వెనుకబాటు కావద్దు ఎలాంటి సమస్యలు అయినా మేము మీకు ఉన్నామని వాళ్లకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి వర్గీకరణ పొలాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర కృష్ణ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎర్ర నవీన్ కుమార్, మాదిగ ఎర్ర జగన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షులు నడ్డి సామ్యూల్ రాజ్,నడ్డి నరసింహ, పొట్ట గళ్ళ అంబేద్కర్ రాణి వార్డు సభ్యులు నడ్డి నరేష్ నడ్డి జగదీష్ నడి గోపాల్ ఎర్ర యాదగిరి, ఎర్ర మనీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర కృష్ణ స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఎర్ర కృష్ణ మాట్లాడుతూ, మాదిగ కులస్తులందరూ ఉమ్మడిగా కలిసికట్టుగా ఉంటే మనం ఏమైనాసాధించగలుగుతామని అన్నారు. ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న సరే ఎమ్మార్పీఎస్ మన జాతిని తలెత్తుకునేలా చేసింది నేను మాదిగనే చెప్పే స్థాయికి తీసుకువచ్చిన నాయకులు మందకృష్ణ మాదిగ, అలాంటి గొప్ప నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టమని మన నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. జండా ఆవిష్కరణ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని ప్రతి సంవత్సరం విజయవంతంగా చేయాలని యువకులకు సూచించారు, ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ మందకృష్ణ సారథ్యంలో సాధ్యమైన తర్వాత ఆ పొలాలను మనము అనుభవించాలంటే విద్యకు దూరంగా వద్దు చదువులో వెనుకబాటు కావద్దు ఎలాంటి సమస్యలు అయినా మేము మీకు ఉన్నామని వాళ్లకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి వర్గీకరణ పొలాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర కృష్ణ మాదిగ ఎంఎస్పి మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎర్ర నవీన్ కుమార్, మాదిగ ఎర్ర జగన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షులు నడ్డి సామ్యూల్ రాజ్,నడ్డి నరసింహ, పొట్ట గళ్ళ అంబేద్కర్ రాణి వార్డు సభ్యులు నడ్డి నరేష్ నడ్డి జగదీష్ నడి గోపాల్ ఎర్ర యాదగిరి, ఎర్ర మనీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


