రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు
ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. అయితే సీఎం చంద్రబాబుతో పాటు 24 మందికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. మూడు జనసేన పార్టీకి, ఒకటి బీజేపీకి మంత్రి పదవులు దక్కాయి. కాగా ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. మిగతా వారు చేయాల్సి ఉంది.
అయితే ఎన్డీయే ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాసంశెట్టి శుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక బుధవారం నాడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు
ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. అయితే సీఎం చంద్రబాబుతో పాటు 24 మందికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. మూడు జనసేన పార్టీకి, ఒకటి బీజేపీకి మంత్రి పదవులు దక్కాయి. కాగా ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. మిగతా వారు చేయాల్సి ఉంది.
అయితే ఎన్డీయే ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాసంశెట్టి శుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక బుధవారం నాడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.


