ఘనంగా దత్త శతకం ఆవిష్కరణ
విశ్వంభర, చిక్కడపల్లి : దత్తాత్రేయ స్వామి తత్వాన్ని భక్తి, ఆధ్యాత్మిక భావాలతో పద్యరూపంలో ఆవిష్కరించిన గ్రంథాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్, హాస్యావధాని శంకర నారాయణ రచించిన 'దత్త శతకం' సంపుటిని హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగానసభలో ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమ్మిళిత స్వరూపమే దత్తాత్రేయుడని పేర్కొన్నారు. ఆయన మహిమను వంద పద్యాల రూపంలో ఆవిష్కరించడం రచయిత శంకర నారాయణ సాహిత్య ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇప్పటివరకు యాభై శతకాలు రచించి "శతక నారాయణుడు"గా గుర్తింపు పొందిన ఆయనను అభినందించారు. యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హాస్య రచయిత, అవధానిగా పేరొందిన శంకర నారాయణ ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ విశిష్ట ముద్ర వేశారని చెప్పారు. ఆయన శతకాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంకర నారాయణ తన 'దత్త శతకం' సంపుటిని పాటల రచయిత, గాయకుడు రాయారావు విశ్వేశ్వరరావుకు అంకితం చేశారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గురుపూర్ణిమ సందర్భంగా ఈ అంకితాన్ని స్వీకరించడం తనకు ఆనందంగా ఉందని, ఈ గౌరవానికి రచయితకు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా దత్త శతకం ఆవిష్కరణ
విశ్వంభర, చిక్కడపల్లి : దత్తాత్రేయ స్వామి తత్వాన్ని భక్తి, ఆధ్యాత్మిక భావాలతో పద్యరూపంలో ఆవిష్కరించిన గ్రంథాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్, హాస్యావధాని శంకర నారాయణ రచించిన 'దత్త శతకం' సంపుటిని హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగానసభలో ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమ్మిళిత స్వరూపమే దత్తాత్రేయుడని పేర్కొన్నారు. ఆయన మహిమను వంద పద్యాల రూపంలో ఆవిష్కరించడం రచయిత శంకర నారాయణ సాహిత్య ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇప్పటివరకు యాభై శతకాలు రచించి "శతక నారాయణుడు"గా గుర్తింపు పొందిన ఆయనను అభినందించారు. యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హాస్య రచయిత, అవధానిగా పేరొందిన శంకర నారాయణ ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ విశిష్ట ముద్ర వేశారని చెప్పారు. ఆయన శతకాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంకర నారాయణ తన 'దత్త శతకం' సంపుటిని పాటల రచయిత, గాయకుడు రాయారావు విశ్వేశ్వరరావుకు అంకితం చేశారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గురుపూర్ణిమ సందర్భంగా ఈ అంకితాన్ని స్వీకరించడం తనకు ఆనందంగా ఉందని, ఈ గౌరవానికి రచయితకు కృతజ్ఞతలు తెలిపారు.


