యోగా గురువు సురేందర్ ఖడ్గరికి సన్మానం
విశ్వంభర, అంబర్ పేట : యోగా సాధనతో ఒత్తిడిని అధిగమించి మనసుకు సమతుల్యత సాధ్యమవుతుందని బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్ కుమార్ అన్నారు. బిజెపి బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడు పి నాగరాజు చారి ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్ అంబర్ పేట డివిజన్ ఎస్బీఐ పార్క్లో జరిగిన కార్యక్రమంలో ఖడ్గరి యోగా సెంటర్ తరఫున యోగా గురువు సురేందర్ ఖడ్గరిని సన్మానించి పుస్తకం బహుకరించారు. ఈ సందర్భంగా రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకుని సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చుక్క జగన్, డాక్టర్ జి హరిచరణ్, దేవరుప్పుల రమేష్, మాజీ కార్పొరేటర్ ఆడప చంద్రమౌళి, ఆవుల పరమేష్ యాదవ్, రాజు, విజయశేఖర్, రామ్ రెడ్డి, మహేష్ గౌడ్, సురేష్ గౌడ్, ఎన్ కవిత తదితరులు పాల్గొన్నారు.
యోగా గురువు సురేందర్ ఖడ్గరికి సన్మానం
విశ్వంభర, అంబర్ పేట : యోగా సాధనతో ఒత్తిడిని అధిగమించి మనసుకు సమతుల్యత సాధ్యమవుతుందని బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్ కుమార్ అన్నారు. బిజెపి బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడు పి నాగరాజు చారి ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్ అంబర్ పేట డివిజన్ ఎస్బీఐ పార్క్లో జరిగిన కార్యక్రమంలో ఖడ్గరి యోగా సెంటర్ తరఫున యోగా గురువు సురేందర్ ఖడ్గరిని సన్మానించి పుస్తకం బహుకరించారు. ఈ సందర్భంగా రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకుని సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చుక్క జగన్, డాక్టర్ జి హరిచరణ్, దేవరుప్పుల రమేష్, మాజీ కార్పొరేటర్ ఆడప చంద్రమౌళి, ఆవుల పరమేష్ యాదవ్, రాజు, విజయశేఖర్, రామ్ రెడ్డి, మహేష్ గౌడ్, సురేష్ గౌడ్, ఎన్ కవిత తదితరులు పాల్గొన్నారు.


